Slider జాతీయం ముఖ్యంశాలు

15 మంది ఇన్ కమ్ ట్యాక్స్ అధికారుల డిస్మిస్

thZ7AZHH9A

ఆదాయపు పన్ను శాఖలో అవినీతి అధికారుల ఏరివేతలో భాగంగా నేడు మరో 15 మందిని డిస్మిస్ చేశారు. ఆదాయపు పన్నుల శాఖ లో పేరుకు పోయిన అవినీతిని ప్రక్షాళన చేయాలని ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలు ఇచ్చిన నాటి నుంచి అవినీతిపరులైన అధికారుల ఏరివేత కొనసాగుతున్నది. సీరియస్ అవినీతి ఆరోపణలు  ఉన్న ఆదాయపు పన్ను విభాగం అధికారులను గుర్తించి ఒక్కొక్కరిపై వేటు వేస్తున్నారు. ఇప్పటి వరకూ మూడు దఫాలుగా 49 మంది ఆదాయపు పన్ను శాఖ ఉన్నత స్థాయి అధికారులను డిస్మిస్ చేశారు. 12 మంది అవినీతి పరులను పదవులు వదిలిపెట్టి వెళ్లిపోయాలని ముందుగా ఆదేశించారు. ఆ తర్వాత ఏరివేత ప్రారంభించారు. ప్రధాని ఆదేశాలతో జూన్ 10 నుంచి అవినీతి ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఏరివేతను ప్రారంభించారు. 22 మంది అధికారులకు పింక్ స్లిప్ లు కూడా ఇచ్చారు. నేడు డిస్మిస్ చేసిన అవినీతి అధికారులలో ఒక ప్రిన్సిపుల్ కమిషనర్ స్థాయి వ్యక్తి కూడా ఉన్నారు

Related posts

కరప్టెడ్ : ఏసిబి కి చిక్కిన శేరిలింగంపల్లి సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌

Satyam NEWS

దుర్గమ్మ సన్నిధిలో రాజకీయ రాక్షసులు

Satyam NEWS

స్పీకర్ సహకారంతో కోటగిరిలో మినీ స్టేడియం నిర్మిస్తాం

Sub Editor

Leave a Comment

error: Content is protected !!