మధ్య బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రానికి అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. నిన్ననే ఈ అల్పపీడనం ఏర్పడవచ్చని అంచనా వేసిన వివిధ వాతావరణ పరిణామాల వల్ల ఆవర్తనం గానే మిగిలిపోయింది.
నేటి సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం బలపడుతుందా లేదా అనేది అప్పుడే చెప్పలేకపోతున్నారు. కానీ దీని ప్రభావంతో నేడూ రేపూ కోస్తాంధ్రలో చెదురుమదురుగా భారీనుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.