రాజధాని ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారిని మరింత ఆవేదనకు గురి చేస్తున్నది. మందడం గ్రామానికి చెందిన వేమూరి గోపి (20) అనే రైతుకూలీ తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి.
అక్కడ గోపి ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంత కాలంగా ఉపాధి లేక మానసికంగా ఆందోళకు గురి అవుతున్నాడు. ఇప్పుడు రాజధాని తరలిపోతుండటంతో భవిష్యత్తుపై దిగులుతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు తెలిపారు.