జగన్ ప్రభుత్వం చేస్తున్న మరో మోసం నేడు బట్టబయలు అయిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. హైకోర్టును కర్నూలుకు మార్చడం లేదని నేడు సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కెకె వేణుగోపాల్ సుప్రీం కోర్టుకు తెలిపారని ఆయన అన్నారు. మూడు రాజధానుల పేరుతో అన్ని ప్రాంతాల వారిని మోసం చేస్తున్న జగన్ రెడ్డి రాయలసీమకు హైకోర్టును కూడా తరలించడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మోసపూరిత ప్రకటనలు మాని రాజధాని వివాదానికి తెరదించాలని ఆయన కోరారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలని రామకృష్ణ కోరారు.
previous post