ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పి మర్చిపోయిన హామీలను ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన లేఖాస్త్రాల ద్వారా గుర్తు చేస్తూనే ఉన్నారు.
ఇందులో భాగంగా మంగళవారం నాడు ఆయన ఆరవ లేఖ సంధించారు. ఉద్యోగులకు డీఏ పెంపు హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే ఉద్యోగులకు బకాయిలు పడ్డ ఏడు డీఏలు వెంటనే అమలు చేయాలని ఆ లేఖలో రాశారు.
కరోనా కారణంగా డీఏ పెంపు వాయిదా వేసిన కేంద్రప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తే అది ఉద్యోగుల్లో వ్యతిరేకతకు దారితీస్తుందన్నారు.
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల పీఆర్సీ నివేదిక మరింత ఆలస్యమవుతుందని, పార్టీ అధికారంలోకి రావడానికి మూలస్తంభంగా నిలిచిన ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపుపై వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రికి రఘురామ కృష్ణంరాజు ఈ మేరకు లేఖ రాశారు.