30.7 C
Hyderabad
April 17, 2024 00: 08 AM
Slider కర్నూలు

కర్నూలు వచ్చి కరోనాతో సహజీవనం చేయండి

#ByreddyRajasekharaReddy

ఎక్కడో కూర్చుని కరోనాతో సహజీవనం చేయండి అని చెబుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్క సారి కర్నూలు జిల్లాలో పర్యటించి కరోనాతో సహజీవనం చేయాలని కర్నూలు బిజెపి నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కోరారు.

కర్నూలు జిల్లాలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అందువల్ల మీరే వచ్చి వాస్తవ పరిస్థితి చూడాలని ముఖ్యమంత్రిని కోరినా ఇప్పటి వరకూ రాలేదని ఆయన అన్నారు. ఈ మేరకు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికి మరో లేఖ రాశారు. కర్నూలు జిల్లాలో ఒక మున్సిపల్ కమిషనర్ కు, ఎంపీ కుటుంబంలో 6 మందికి,  ఏడుగురు డాక్టర్లు కరోనా సోకడం హాస్పిటల్స్ మూసివేయడం వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. 

కలెక్టరే స్వీయనిర్భంధంలోకి వెళ్లిపోయారు సారూ ఒక్క సారి చూడండి

జిల్లాలో వైరసు వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోవాల్సిన జిల్లా కలెక్టర్  స్వీయ నిర్బంధంలో వుండటంతో ఈ వైరస్ వ్యాప్తి ఎంత స్పీడుగా ఉందో అర్థం చేసుకోవచ్చునని ఆయన అన్నారు.  కరోనాతో మనం సహా జీవనం చేసేది కాదు కరొననే మనతో సహజీవనం చేసే పరిస్థితికి తెచ్చారని ఆయన విమర్శించారు.

దీనికి తోడు పక్కన వున్న రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు మైకులలో  ఆంధ్రప్రదేశ్ కు ఎవరు కూడా వెళ్లకండి అని చెప్పడం మరింత ఆందోళన చెందే పరిస్థితికి తెచ్చిందని ఆయన అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారే ఇంత భయపడుతుంటే ఇక మన రాష్ట్రంలోని రెడ్ జోన్లలో వున్న కర్నూలు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో వున్న ప్రజలు మరెంత భయపడుతుంటారు అన్నది ఒక్కసారి ఆలోచించండని ఆయన కోరారు.

ప్రభుత్వ తప్పిదం వల్లే ఇంత ఘోరం  

ఇదంతా కూడా ప్రభుత్వ తప్పిదమేనని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా ప్రజల్లో  అభద్రతాభావాన్ని పోగొట్టేందుకు మీరు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ కమ్యూనిటీ స్ప్రెడ్ స్థాయికి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని ఆయన తెలిపారు.

కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి  వాలంటరీ లను ఏర్పాటు చేసింది మీ పార్టీకి, మీకు పబ్లిసిటీ చేయడం కోసం కాదు ప్రజలకు సేవ చేసేందుకు అనేది గుర్తించాలని ఆయన కోరారు. అయితే మర్ఖజ్ వెళ్లి వచ్చిన వారిని గుర్తించే విషయంలో మీరు ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు.

Related posts

నూతన సంవత్సర వేడుకలను బహిష్కరించిన టీడీపీ

Satyam NEWS

వనపర్తిలో రోడ్ల విస్తరణకు సహకరించాలి

Satyam NEWS

వైసీపీ కడప జడ్పీటీసీ చైర్మన్ కు జనసేన నాయకురాలి అభినందనలు…

Satyam NEWS

Leave a Comment