ఆంధ్రప్రదేశ్ లో మరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ వచ్చింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. అధికారులు అప్రమత్తం అయి ఆయనను హుటాహుటిన క్వారంటైన్ కి తరలిస్తున్నట్లు సమాచారం.
నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇటీవల చెన్నై ప్రాంతం నుంచి వచ్చిన వారిని కలవడం వల్లే కరోనా సోకిందని అనుమానం.