రాజంపేట డివిజనల్ లో ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వారంటైన్ లో మరో 800 పడకలు ఏర్పాటు చేయనున్నట్టు రాజంపేట రెవెన్యూ డివిజన్ అధికారి ధర్మచంద్రా రెడ్డి తెలిపారు. రాజంపేట, రైల్వే కోడూరు, బద్వేలు లో 100 పడకల కామన్ క్వారంటైన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
తాజాగా వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మరో 800 పడకలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారి జాబితాలో రాజంపేట కి చెందిన వారు ఇద్దరు ఉన్నారని, వారి నమూనాలు పరీక్ష కు పంపి ఉన్నామని తెలిపారు. ఫలితం ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధం గా ఉన్నామని తెలిపారు. రాజస్థాన్ నుంచి వచ్చిన నవోదయ విద్యార్థులల్లో ఎటువంటి అనారోగ్య లక్షణాలు లేవని, ఇప్పటికీ వారు వచ్చి 14 రోజులు దాటిందని వారిని ఇంటికి పంపి వేస్తా మన్నారు. కాగా రెవెన్యూ అధికారుల సహకారంతో రైతుల కు పాసులు ఇచ్చి వారి పంట అమ్మకానికి అనుమతి ఇస్తున్నామని, ఉపాధి హామీ పనులు జరుగుతున్నప్పుడు కూలీలకు అవకాశము కల్పిస్తున్నామని తెలిపారు.