అడుగడుగునా దుర్మార్గులు నిండి ఉన్నారని ప్రియాంకా రెడ్డి కేసుతో బాటు జరుగుతున్న చాలా సంఘటనలు జరుగుతున్నాయి. నిజాంపేట ఈశ్వర్ విల్లాస్ రోడ్డులో ఉండే సాఫ్ట్ వేర్ యువతిపై ఒకడు అత్యాచారానికి ప్రయత్నం చేశాడని తెలిసింది.
ఇంట్లో ఎవరు లేని సమయంలో లో రూమ్ లోకి వచ్చి అఘాయిత్యానికి పాల్పడేందుకు ఒకడు ప్రయత్నించాడు. సమయానికి స్థానికులు గమనించి అప్రమత్తమయ్యారు. దాంతో ఆ దుర్మార్గుడు పరారయ్యాడు. జరిగిన సంఘటనతో బాధితురాలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నది. బాధితురాలిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.