34.2 C
Hyderabad
April 19, 2024 18: 57 PM
Slider ముఖ్యంశాలు

రెబెల్ వాయిస్: వైసీపీలో మరో ధిక్కార స్వరం

#Dharmana Prasadarao YCP

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు పాలనాంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు, వివాద రహితుడు అయిన ఆనం రామనారాయణ రెడ్డి గత రెండు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ పనితీరును తీవ్ర వ్యాఖ్యానాలతో విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

ఆయన వ్యాఖ్యల కలకలం సాగుతున్న తరుణంలోనే మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు  ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని సమక్షంలోనే అధికారుల తీరుపై మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జీజీహెచ్ అభివృద్ధి సమీక్షా సమావేశంలో అధికారుల తీరును ధర్మాన ప్రసాదరావు ఎండగట్టారు. ఆసుపత్రుల్లో శానిటేషన్ ఉద్యోగం కోసం డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.

సెంట్రలైజేషన్ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అసలు శానిటేషన్ కాంట్రాక్టు ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ముంబైకి చెందిన వ్యక్తికి శానిటేషన్ కాంట్రాక్టును ఎందుకు కట్టబెట్టారని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు మాజీ మంత్రులు అధికారుల తీరుపై మండిపడడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

Related posts

నాగ్ పూర్ లో 21వ తేదీ వరకూ సంపూర్ణ లాక్ డౌన్

Satyam NEWS

సేవాభారతి ఆధ్వర్యంలో ఆయుర్వేద కషాయం పంపిణీ

Sub Editor

భోగాపురం ఎయిర్ పోర్టు పేరుతో మరో కొత్త డ్రామా…! 

Satyam NEWS

Leave a Comment