28.7 C
Hyderabad
April 20, 2024 06: 02 AM
Slider జాతీయం

మహారాష్ట్ర లో మరో సాధువు దారుణ హత్య

#Another Sadhu Murder

శివసేన అధికారంలో ఉన్న మహారాష్ట్ర లో మరో సాధువు హత్యకు గురయ్యాడు. పాల్ఘర్ లో ఇద్దరు సాదువులను వెంటాడి వేటాడి చంపిన సంఘటన జరిగిన కొద్ది రోజులకే మరో సాధువు హత్యకు గురి కావడం మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది.

నాందేడ్‌ లోని ఆశ్రమంలో ఉన్న శివాచార్య అనే గురువును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. శివాచార్య గొంతు కోసి బాత్ రూంలో పడేశారు. హత్య తర్వాత డబ్బు, బంగారం దోచుకుని పారిపోతుండగా హంతకులను స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే వారు దొరక్కుండా పారిపోయారు.

ఏప్రిల్ 16న పాల్ఘర్ లో ఇద్దరు సాధువులపై సామూహిక దాడి చేసి చింపేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే మహారాష్ట్రలో మరో సాధువు హత్య జరగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్ధవ్ ధాకరే పాలనలో హిందూ సాధువుల వరుస హత్యలు సంచలనం కలిగిస్తున్నాయి.

పాల్ఘర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ 120 మందిని అరెస్ట్ చేశారు. ఎస్పీ గౌరవ్ సింగ్‌ను తప్పించి దత్తాత్రేయ షిండేను కొత్త ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. అంతే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో మరో హత్య జరిగింది.

Related posts

గుర‌జాడ  ఆడిటోరియం…మ్యూజీయం సంగ‌తేంటి..?

Satyam NEWS

లోకేశ్వరి, పురందేశ్వరి ఆవిష్కరించిన మహానటుడు, ప్రజానాయకుడు – ఎన్ .టి .ఆర్

Satyam NEWS

ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలు చెంచులకు అందాలి

Satyam NEWS

Leave a Comment