శివసేన అధికారంలో ఉన్న మహారాష్ట్ర లో మరో సాధువు హత్యకు గురయ్యాడు. పాల్ఘర్ లో ఇద్దరు సాదువులను వెంటాడి వేటాడి చంపిన సంఘటన జరిగిన కొద్ది రోజులకే మరో సాధువు హత్యకు గురి కావడం మహారాష్ట్రలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నది.
నాందేడ్ లోని ఆశ్రమంలో ఉన్న శివాచార్య అనే గురువును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. శివాచార్య గొంతు కోసి బాత్ రూంలో పడేశారు. హత్య తర్వాత డబ్బు, బంగారం దోచుకుని పారిపోతుండగా హంతకులను స్థానికులు అడ్డుకునే యత్నం చేశారు. అయితే వారు దొరక్కుండా పారిపోయారు.
ఏప్రిల్ 16న పాల్ఘర్ లో ఇద్దరు సాధువులపై సామూహిక దాడి చేసి చింపేసిన విషయం తెలిసిందే. ఇంతలోనే మహారాష్ట్రలో మరో సాధువు హత్య జరగడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్ధవ్ ధాకరే పాలనలో హిందూ సాధువుల వరుస హత్యలు సంచలనం కలిగిస్తున్నాయి.
పాల్ఘర్ ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటి వరకూ 120 మందిని అరెస్ట్ చేశారు. ఎస్పీ గౌరవ్ సింగ్ను తప్పించి దత్తాత్రేయ షిండేను కొత్త ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. అంతే తప్ప కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో మరో హత్య జరిగింది.