అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటీవ్ వచ్చింది. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఇటీవలే టెస్టులు చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది.
ఎమ్మెల్యేతో పాటుగా, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డికి అయన భార్యకు కూడా కరోనా వైరస్ సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. కరోనా కేసులు అత్యధికంగా కర్నూల్ జిల్లాలోనే నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి పోలీసులు, వైద్యులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు ఎవర్ని కూడా కరోనా వదలడం లేదు.