అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు కరోనా సోకడం ఆగలేదు. తాజాగా మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గొల్ల బాబురావుకి కరోనా ఉందని అతనే స్వయాన తెలిపారు.
కరోనా బారిన పడిన ఎమ్మెల్యేలు ఎంపిలు హైదరాబాద్ లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు సెల్ఫ్ క్వారంటైన్ లోకి కూడా వెళ్లిపోయారు.