ములుగు బస్సు స్టాండ్ లో ర్యాపిడ్ ఆంటిజన్ టెస్టు క్యాంపులో భాగంగా ప్రయోగాత్మకంగా నేడు పరీక్షలు నిర్వహించారు. దాదాపుగా 17 మందికి కరోనా టెస్ట్ చేయగా ఒక్కరికీ కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఈరోజు ములుగు జిల్లా టీబీ,ఎయిడ్స్, లెప్రసి నియంత్రణ అధికారి డాక్టర్ పోరిక రవిందర్ ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించారు. ఇదే విధంగా రోజు విడిచి రోజు ములుగు పట్టణంలో రద్దీగా ఉన్న ప్రదేశాలలో ఏర్పాటు చేస్తామని డాక్టర్ పోరిక రవిందర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య వచ్చి తన అమూల్యమైన సలహాలు, సూచనలను వైద్య సిబ్బందికీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం PHC వైద్యాధికారిణి డాక్టర్ పోరిక జ్యోత్న, వైద్య సిబ్బంది పాల్గొన్నారు