36.2 C
Hyderabad
April 16, 2024 21: 49 PM
Slider ప్రత్యేకం

ఆంధ్రాలో బీజేపీ నాయకులలో మార్పు రాదా?

#HamaraPrasad

అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం ముమ్మాటికీ తప్పే అని రాష్ట్రీయ దళిత సేన, హైందవ సంఘాల ఐక్యవేదిక నాయకుడు హమారా ప్రసాద్ వ్యాఖ్యానించారు.

‘‘ ఆంధ్ర బీజేపీ నాయకుల్లారా ఇప్పటికైనా మారండి.. జగన్ ను పక్కకు పడియండి…అని ఆయన పిలుపునిచ్చారు. ముందు జగన్ కి సపోర్ట్ ఇచ్చి, టీడీపీ ని మొత్తం ఆంధ్రలో తొక్కేసి, తర్వాత జగన్ ని తొక్కేస్తే ఆంధ్ర బీజేపీ దే అనుకోవడం మీ అత్యాశ అవుతుందని ఆయన అన్నారు.

బాబు, జగన్ ని తొక్కేసే క్రమంలో, ఆ సమయంలో మత మార్పిడి మాఫియా, మత మర్పిడిలు చేసి ఆంధ్రలో బీజేపీ మేల్కొనే సరికీ, ఆంధ్రలో హిందువులు మైనార్టీలోకి వెళ్ళిపోతారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు కోటికి పైగా హిందువులను మత మర్పిడిలు చేశారని హమారా ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర మళ్ళీ ఒక నాగాలాండ్ లాగా అయిన తర్వాత బీజేపీ ఆంధ్రలో సాదించేది ఏమి ఉండదు…బీజేపీ నాయకుల్లారా జగన్ మత్తులో నుండి బయటికి రండి… అంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఆంధ్ర ప్రజల మనసులోని వేదనను అర్ధం చేసుకుని, ఆంధ్రను కాపాడండి… అని ఆయన అన్నారు.

Related posts

నీ చావు నువ్వు చావు నేను మాత్రం సేఫ్

Satyam NEWS

అమానవీయ చర్యలను ఆపలేరా?

Bhavani

ట్రూ అప్ చార్జీలు రద్దు చేయకపోతే పోరాటం తీవ్రం చేస్తాం

Satyam NEWS

Leave a Comment