ఏపి బ్రాడ్ కాస్టిరీగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (ఏపిబిజేఏ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా నిడదపోలు కాశీరావు, బి. వెంకట్రావులు ఎన్నికైయ్యారు.
సోమవారం ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం ఎన్నికైయ్యింది. ఉపాధ్యక్షులుగా విస్సా సురేష్, కిరణ్, సహాయ కార్యదర్శులుగా అశోక్, కోశాధికారిగా సందిరెడ్డి నరేంద్రలు ఎన్నికైయ్యారు.
కార్యవర్గ సభ్యులుగా పసుపులేటి కృష్ణ (కొండేపి), ఎస్స్ బాజీ వలి (మార్కాపురం), పిచ్చయ్య (దర్శి), పల్లపోతు చంద్ర (ఎఎ్ప డు), మనోహర్ (కందుకూరు), శంకర్ (వై పాలెం), కాశీరెడ్డి (గిద్దలూరు),
ఆంజనేయులు (చీరాల), ప్రసాద్ (కనిగిరి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమావేశం పలు తీర్మానాలను ఆమోదించింది.
అర్హులైన జర్నలిస్టులందరికి అక్రిడేషన్లు, బస్ పాస్లు మంజూరు చేయాలని, శింగరాయకొండలో జర్నలిస్టుల పై మోపిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని, కోవిడ్ బాధిత జర్నలిస్టులను ఆదుకోవాలని,
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు చేపట్టాలని సమావేశం తీర్మానించింది. ఇదిలాఉండగా నూతనంగా ఎన్నికైన కమిటీకి ఏపిడబ్యుజేఎఫ్ అభినందనలు తెలియజేసింది.
రాష్ట్ర కార్యదర్శి వి. భక్తవత్సలం, గౌరవాధ్యక్షులు కె.అశోక్ బాబు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొట్టిపాటి నాగేశ్వరరావు, ఎస్వీ బ్రహ్మలు అభినందనలు తెలియజేశారు.