32.2 C
Hyderabad
March 29, 2024 01: 14 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఎందుకో ఈ తొందర?: రేపే ఏపీ కేబినెట్‌ భేటీ

jagan y s

మంత్రి వర్గ సమావేశం తేదీని ఏపి ముఖ్యమంత్రి ఎందుకో తెలియదు కానీ ముందుకు జరిపారు. ఈ నెల 20 న మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని భావించినప్పటికీ తాజాగా రేపటికే మారుస్తూ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఈ భేటీ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

పరిపాలన వికేంద్రీకరణ, ఏపీ సమగ్రాభివృద్ధి పై జీఎన్‌ రావు, బోస్టన్‌ గ్రూప్‌లు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ నివేదికలపై పలువురు మంత్రులు, ఐఏఎస్‌ అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. కేబినెట్‌ భేటీకి ముందే ఆ కమిటీ తమ నివేదికను సీఎం జగన్‌కు అందించే అవకాశముంది.

కేబినెట్‌ భేటీలో పలు అంశాలతో పాటు హైపవర్‌ కమిటీ నివేదిక పైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ గతంలో సీఎం జగన్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ అంశంపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

మరో వైపు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. హైపవర్‌ కమిటీ నివేదిక, రాజధానుల అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రాజధానులపై ఎలాంటి ప్రకటన చేయనుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related posts

శ్రీకాకుళంలో మరో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు

Satyam NEWS

ఇంద్రవెల్లి లో సీఎం రేవంత్ సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

రాజన్న సిరిసిల్లా జిల్లాలో కోవిడ్ ఆసుపత్రి

Satyam NEWS

Leave a Comment