32.7 C
Hyderabad
March 29, 2024 11: 56 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఎన్నో ఆశలతో నన్ను గెలిపించారు:జగన్

Maa sharma

తమ జీవితాల్లో మార్పు రావాలని బలంగా కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు తనను ఎన్నుకున్నారని, వారి ఆశలు తీర్చడమే తన జీవిత ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. సుప్రసిద్ధ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పై ఛాయాచిత్రాలకు వ్యాఖ్యా సహితంగా పుస్తకాన్ని రూపొందించారు. ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రఖ్యాత పాత్రికేయుడు శేఖర్ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విజయవాడ ముఖ్యమంత్రి జగన్ క్యాంపు లో జరిగిన  ఈ సభలో వై ఎస్ జగన్ మాట్లాడుతూ తనపై ప్రజలు ఉంచుకున్న నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లో వమ్ము కాకుండా చూస్తానని అందుకోసమే ఎంత శ్రమ అయినా పడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్టు మాశర్మ కూడా పాల్గొన్నారు.

Related posts

బోనాల పండుగ

Satyam NEWS

సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్న సిసోడియా

Satyam NEWS

పెన్నా నదిపై కొత్త బ్రిడ్జికి నెల్లూరు ఎంపీ ఆదాల శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment