28.2 C
Hyderabad
March 27, 2023 09: 59 AM
Slider ఆంధ్రప్రదేశ్

వరదలపై సీఎం ఆరా: అధికారులూ అప్రమత్తంగా ఉండండి

pjimage (9)

వరద ఉధృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జెరూసలేంలో పర్యటనలో ఉన్న సీఎం ఉభయోగదావరి జిల్లాలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న దానిపై ఆరా తీశారు. ఎప్పటికప్పుడు నివేదికలు పంపించాలని అధికారులను ఆదేశించారు. ఇకపోతే ఉభయగోదావరి జిల్లాలలో లంక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల పరిస్థితి అక్కడ చేపట్టిన సహాయక చర్యలపై జగన్ ఆరా తీశారు. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి భోజనం సహా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు జగన్ సూచించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలకు జాప్యం లేకుండా నిత్యావసర సామాగ్రి అందించాలని ఆదేశించారు. మరోవైపు ముంపు బాధితులకు 25 కేజీల బియ్యం, 2 లీటర్ల కిరోసిన్, కేజీ కందిపప్పు, లీటరు పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. 

Related posts

జమ్మలమడుగు వ్యవసాయ కమిటీ చైర్మన్ గా నార్పల

Satyam NEWS

ఆత్మహత్య చేసుకున్న రైతు వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యే రఘునందన్ అరెస్టు

Satyam NEWS

రాజమండ్రి సెంట్రల్ జైలు లో 10 మందికి కరోనా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!