28.7 C
Hyderabad
April 20, 2024 03: 32 AM
Slider ప్రత్యేకం

రోడ్డు ప్రమాదంలో మరణించిన పోలీసులకు డిజిపి సంతాపం

#APDGP

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  నలుగురు ఏ‌ఆర్  పోలీసులు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందిని డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ జవాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కలకత్తా లో అప్పగించి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్‌ఐ, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. తక్షణం ఘటనా స్థలాన్ని చేరుకొని వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని రేంజి డిఐజి, జిల్లా ఎస్పీని డిజిపి ఆదేశించారు. అదే విధంగా ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విధి నిర్వహణలో నలుగురు పోలీసుల మరణం మా పోలీస్ కుటుంబానికి తీరని లోటు అని డిజిపి తెలిపారు. మరణించిన పోలీస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ వారి కుటుంబలకు అండగా ఉంటుందని డి‌జి‌పి తెలిపారు.

Related posts

రైతు మేలు కోసమే నియంత్రిత సాగు విధానం

Satyam NEWS

ఐదు దశాబ్దాల హిందువుల కల నెరవేరింది

Satyam NEWS

చదువురాని దానవు, నువ్వేం సర్పంచ్ వి పక్కకు జరుగు

Satyam NEWS

Leave a Comment