ఎన్ని షోలు కావాలన్నా వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం మహేష్ బాబు సినిమాకు అనుమతి ఇచ్చేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం 11వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే. నిర్మాత ప్రత్యేక షోలకు అనుమతి కోరడంతో 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
మహేష్ బాబు తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏపీలో ప్రత్యేక షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ నిర్మాత అనిల్ సుంకర ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖను పరిశీలించిన ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది.
ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ప్రతి రోజు అదనంగా రెండు షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ చిత్రానికి సంబంధించి రోజూ 6 షోలు వేసుకోవచ్చు.