ఏపి హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి మరో మారు చుక్కెదురు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.
రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు.
అనంతరం ఫిబ్రవరిలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయితీల) ఎన్నికల నిర్వహణపై తన అభిప్రాయాన్ని చెప్పారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే వీలులేకుండా స్టే ఇవ్వాలని కోరింది. అయితే దీనికి రాష్ట్ర హైకోర్టు స్టే నిరాకరించింది. కేసును రేపటికి వాయిదా వేశారు.