పరిషత్ ఎన్నికలు నిలుపుదలచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఉత్తర్వులను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. రేపు 8వ తేదీన యధావిధిగా ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికలు జరగడానికి అనుమతించారు.
ఎన్నికల కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం ల తరపున సి.వి.మోహాన్ రెడ్డి, శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఏకీభవించింది.
రేపు 8వ తేదీ ప్రతిన ప్రతి పౌరుడూ తమ ఓటుహక్కు ను ఉపయోగించుకోవాలని ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేసింది. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు.