కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన, చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని, నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయంను ఆదివారం ఎపి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ దంపతులు, కడప జిల్లా జడ్జి శ్రీనివాసులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నందలూరులో శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయ చైర్మన్ అరిగేల సౌమిత్రి ,అధికారులు, అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పూలమాల శాలువాతో సత్కరించారు. తీర్థప్రసాదాలు అందించి ఆలయ విశిష్టతను గురించి వివరించారు.