వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన మరో జీవోను ఏపీ హైకోర్టు కొట్టేసింది. ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు 53, 54లను హైకోర్టు తోసిపుచ్చింది. మేనేజ్మెంట్ నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమ్యాన్యాలు జోవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.