ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితికి మించి అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది.
కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి ఈ సమాధానం ఇచ్చారు. 2020-21 ఏడాదిలో రూ.4 వేల కోట్లు పరిమితికి మించి అప్పులు చేసినట్లు మంత్రి వెల్లడించారు.
2020-21లో రూ.49,497 కోట్లు అప్పు పొందేందుకు ఏపీకి అనుమతి ఉందని ఆయన స్పష్టం చేశారు. 2020-21లో రూ.54,369.18 కోట్లు ఆర్థిక లోటు ఉన్నట్లు బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు.