ఏపీ పీసీసీకి కొత్త అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ ను నియమించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత రఘువీరారెడ్డి స్థానంలో శైలజానాథ్ బాధ్యతలు అందుకుంటారు. ఇక, రాష్ట్రంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పార్టీకి కొత్త జవసత్వాలు అందించడానికి అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
previous post