సొంత గ్రామంలో సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేసుకోవడానికి స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దాంతో ఆయన స్వగ్రామం అయిన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో ఎన్నిక అనివార్యం అయింది.
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి వాణి సర్పంచ్గా నామినేషన్ దాఖలు చేశారు. తొగరాం స్వగ్రామం కావడంతో సర్పంచ్ ఎన్నికను స్పీకర్ తమ్మినేని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే టీడీపీ బలపరిచిన అభ్యర్థి తమ్మినేని భారతమ్మ కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా భారతమ్మ ఉపసంహరించుకోకపోవడంతో పోటీ అనివార్యం అయింది.