27.7 C
Hyderabad
April 20, 2024 01: 52 AM
Slider శ్రీకాకుళం

తూర్పుకాపు సంక్షేమ సంఘం ప్రధానకార్యదర్శిగా పతివాడ

#TurpuKapu

ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం  రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా పతివాడ గిరీశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా  కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం  రాష్ట్ర                   అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ నియామక పత్రాన్ని అందజేశారు.

నూతనంగా ఎన్నికైన రాష్ట్ర ప్రధానకార్యదర్శి   గిరీశ్వరరావు మాట్లాడుతూ తన  రాజకీయ అనుభవంతో  తూర్పుకాపు కుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. తనకు ఇచ్చిన బాధ్యతను  రాజకీయ పార్టీలకతీతంగా  జాతి ఐక్యత కోసం పనిచేస్తాని అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం   రాష్ట్ర అధ్యక్షులు  చంద్రమోహన్ మాట్లాడుతూ  రాష్ట్రవ్యాప్త  తూర్పుకాపు ఆత్మగౌరవ సంక్షేమ పోరాట యాత్రకు  సిద్ధం కావాలని  పిలుపునిచ్చారు.

తూర్పుకాపు కుల రిజర్వేషన్ల సాధన కోసం  అన్ని రాజకీయపార్టీల  అధినేతల  మద్దతును కోరినా ఇంతవరకు  పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు వావిలపల్లి జగ్గునాధం నాయుడు, APTKSS యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధన్నాన భోగినాయుడు, ఉద్యాగ విభాగ రాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు, నేతలు పతివాడ రమణారావు, మహేష్ కుమార్, చందక సూర్యనారాయణ, పుర్లీ  ఈశ్వరరావు పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లా కోర్టును మోడల్ కోర్టుగా తీర్చిదిద్దుతాం

Satyam NEWS

కే ఏ పాల్ పై టిఆర్ఎస్ కార్యకర్తల దాడి

Satyam NEWS

నియంతృత్వ ధోరణి వద్దు రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోండి

Satyam NEWS

Leave a Comment