రెండు నెలలుగా జీతాల్లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని AP24x7 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు AP24x7 కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. పాత మూడు నెలల వేతనాలతో పాటు, ఏడాది పీఎఫ్, ఈస్ఐ బకాయిలను వెంటనే చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. జీతాల్లేక గత కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నామని కుటుంబాలను కూడా పోషించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నా యాజమాన్యం స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ఉద్యోగుల బాధలను అర్థం చేసుకోని వెంటనే వారికి బకాయి ఉన్న మొత్తం వేతనాలు అందించాలని డిమాండ్ చేశారు.
previous post