సిధ్ధ సమాజ వ్యవస్థాపకులు, ఘోర తపస్వి…తమిళనాడు రాష్ట్రం పళినిలో సమాధి పొందిన స్వామి శ్రీ శివానంద పరమహంసల వారి జయంతి కార్యక్రమం….ఏపీలో ని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలసలో కడు వైభవంగా నిర్వహించారు… ఆశ్రమ శిష్యులు. ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ శ్రీగురూజీ…విదేశాల్లో ఆధ్యాత్మిక ప్రవచన ప్రచారంలో ఉండగా…వారి పుత్రుడు శివరామకృష్ణ… కుటుంబం తో ఆశ్రమం కు ముందు రోజే వచ్చి…. సరిగ్గా డిశెంబర్ 7 న స్వామి శివానంద పరమహంసల వారి జన్మదినం సందర్భంగా మిగిలిన శిష్యులతో ఘనంగా నిర్వహించారు.
తొలుత సమాధిమందిరంలో స్వామీజీ పూజ పూర్తవ్వంగానే ఆశ్రమంలో స్వామిజీ పీఠం వద్ద స్వామి శివానందుర వారి జన్మదిన సందర్భంగా శ్రీగురుగీత ,సద్గురు పాదుకాస్త్తోత్రం..అష్ఠోత్తర నామావళిని…ఆశ్రమ శిష్యులు… డా.ఎన్వీఎస్ హరగోపాల్ …శ్రీగురూజీ ఆదేశానుసారం పఠించారు.అనంతరం ప్రసాద వితరణ చేసారు… శిష్యులు. ఆ తర్వాత శ్రీగురూజీ స్వదేశ ఆగమనం సందర్భంగా 15,18 తేదీలలో అటు విశాఖ ఇటు ఆశ్రమంలో …వారికి ఏ విధంగా స్వాగత ఏర్పాట్లు చేయ్యాలో…శ్రీగురూజీ కొడుకు శివరామకృష్ణ ,డా.సుబ్రహ్మణ్యం, ఎంవీఆర్ఎల్ఎన్.కుమార్, లక్ష్మణరావు, చక్రవర్తి, విజయగోపాల్…జగ్గారావు లతో ఇతర ముఖ్య మైన శిష్యులు చర్చించడం జరిగింది.