40.2 C
Hyderabad
April 24, 2024 15: 41 PM
Slider నల్గొండ

మానవ సేవే మాధవ సేవగా సేవలందిస్తున్న అపరంజీ చారిటబుల్ ట్రస్ట్

#aparanjeetrust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఐ ఎన్ టి యు సి అనుబంధ (మట్టపల్లి అడ్డా) రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో యూనియన్ అధ్యక్షుడు షేక్. హుస్సేన్ అపరంజీ చారిటబుల్ ట్రస్టుకు క్వింటా బియ్యం,నూనె డబ్బాను విరాళంగా అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐ ఎన్ టి యు సి నియెజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురువయ్య మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి అపరంజీ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హుజర్ నగర్ పట్టణ ప్రాంతంలో వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు నిత్యం అన్నదానం చెస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ట్రస్ట్ సభ్యులు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తున్నారని,వారికి భగవంతుడు ఆర్థిక శక్తిని ప్రసాదించాలని,దాతలు ప్రజలకు ఉపయోగపడే అపరంజీ చారిటబుల్ ట్రస్ట్   ను ప్రోత్సాహించాలని అన్నారు.ఐ ఎన్ టి యు సి అనుబంధ సంఘాలు మానవ సేవా కార్యక్రమాలు చేయ్యడంతో పాటు విరాళాలు అందజేయడం చాలా సంతోషదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి పట్టణ ప్రదాన కార్యదర్శి పోతనబోయిన రాంమూర్తి,రాజీవ్ గాంధీ ఆటో యూనియన్ ప్రదాన కార్యదర్శి కందుకూరు యువరాజు {చంటి}, ఉపాధ్యక్షుడు సోమగాని నర్సింహారావు, మాజీ అధ్యక్షుడు కస్తాల రవీందర్,కల్లూరి భీమయ్య,మాజీ ప్రదాన కార్యాదర్శి రెడపంగు రాము,యూనియన్ నాయకులు పులి పాపయ్య,సోమగాని నరేష్,షేక్ జలీల్,దాసరి వీరబాబు,పోలేపల్లి శ్రీను,ధరవత్ రమేష్,కాల్వ పెద్ద వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

త్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఉద్యోగాల క‌ల్ప‌న‌, నిరుద్యోగ భృతిలో ప్ర‌భుత్వం విఫ‌లం బీజేవైఎం

Sub Editor

న్యూ బిగినింగ్: దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభం

Satyam NEWS

సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం: ఈటల రాజేందర్

Satyam NEWS

Leave a Comment