36.2 C
Hyderabad
April 25, 2024 19: 51 PM
Slider నల్గొండ

అపరంజి ట్రస్టు సేవలను అభినందించి తోడ్పాటు ఇవ్వాలి

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్టాండ్ లోపల గడిచిన 13 నెలలుగా ‘అపరంజి ట్రస్ట్’సభ్యులు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ట్రస్ట్ నిర్వాహకులైన గోపాలపురం గ్రామవాసి మన్నూరు కాశయ్య పేద కుటుంబంలో పుట్టి 10 మంది పేదలకు పట్టెడన్నం పెట్టాలనే తలంపు తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది సాహసోపేతం అయినా నేటి వరకు పట్టు విడవక ఓర్పుతో నిర్వహిస్తున్నారు.

అపరంజి ట్రస్ట్ వారికి పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు ఆర్యవైశ్య సంఘం వారు. గురువారం అన్నదాన కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మాశెట్టి అనంత రాములు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాశెట్టి అనంతరాములు మాట్లాడుతూ ఈ బృహత్తర కార్యక్రమాని చేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ తనవంతు సహాయంగా ఒకరోజు అన్నదాన కార్యక్రమానికి విరాళం ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు బచ్చు రామారావు, పట్టణ అధ్యక్షులు ఓరుగంటి నరసింహారావు,ట్రాన్స్కో డీఈ ఎ.శ్రీనివాస్,అవోపా అధ్యక్షుడు వంగవీటి హనుమంతరావు,పారేపల్లి సత్యనారాయణ,దాసరాజు నారాయణ, కోలపాటి వెంకటేశ్వర్లు,మాజీ ఎంపీటీసీ గుండా రమేష్ పాల్గొన్నరు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఎస్ఐ లకు మెమో జారీ చేసిన వనపర్తి ఎస్పీ

Satyam NEWS

రాజ్ నాథ్ కు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి పలుకరింపు

Satyam NEWS

పోలీసులు కొట్టడంతో అవమానభారంతో ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment