వేదిక సీ.సీ.టీ.వీ జాతీయ విశిష్టత సేవా పురస్కారాలు ప్రధానం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వేదిక కార్యదర్శి ఎస్ .టి. పి. కృష్ణ కుమారి ఒక ప్రకటనలో తెలిపారు.
సంగీతం, సాహిత్యం, సంస్కృత, రచన, నటన, గానం, నృత్యం, సామాజిక సేవా రంగాలలో, శాస్త్ర సాంకేతిక, జ్యోతిష్యం, వాస్తు, భక్తి, వైద్యం, విద్యా బోధన, యోగా, వ్యాయామ విద్య , క్రీడలు, లో వివిధ రంగాలలో విశిష్టత ప్రతిభావంతుల నుంచి బాలరత్న, కళా మిత్ర, సేవ హృదయ, అక్షర రత్న, గురు రత్నా, పురస్కారాల ప్రధానం కోసం దరఖాస్తులు అర్హులైన వారు అంద చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 12వ తారీకు లోపున , అర్హులైన వారు దరఖాస్తు అందజేయాలని కోరుతున్నారు.
2021 నవంబర్ ఒకటో తారీఖున విజయవాడలో తెలుగు చలనచిత్ర, టెలివిజన్, సాహిత్య కళారంగాలలో ప్రముఖుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
మరింత సమాచారం కొరకు 9848015414 టెలిఫోన్ నంబరులో గాని, వేదిక సీసీటీవీ సొసైటీ@ జి మెయిల్ డాట్ కాం సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.