సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్రం లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న పోతబత్తిని రుధిరాంజలి 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా మండల వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద శుక్రవారం సిఎం కెసిఆర్ ఆవిష్కరించిన లోగోను రుధిరాంజలి తన ప్రతిభ ద్వారా వేసి పలువురి ప్రశంసలను అందుకుంది.
రుధిరాంజలి వేసిన చిత్రలేఖనాన్ని తిలకించిన మండల తహశీల్దార్ సాయి గౌడ్,ఎంపీడీవో జానకి రాములు,ఎఈఓ భావన,ఝాన్సీ,ఆర్ఐ రమణారావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రుధిరాంజలి కుటుంబ సభ్యులు పోతబత్తిని శ్రీనివాస్, అరుణ,అమరారావ్,పున్నయ్య,ప్రసాద్, మైసయ్య తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్