35.2 C
Hyderabad
April 24, 2024 11: 11 AM
Slider నల్గొండ

నూరుశాతం కరోనా వ్యాక్సిన్ అందచేసిన అట్లూరి మంజులకు ప్రశంసాపత్రం

#atlurimanjula

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా 19వ వార్డులో మొదటి మోతాదు వంద శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినందుకు ఆ వార్డు కౌన్సిలర్ అట్లూరి మంజుల హరి బాబు ప్రశంసాపత్రాన్ని దక్కించుకున్నారు. మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి ఈ ప్రశంసాపత్రాన్ని ఆమెకు అందచేశారు.

ఈ సందర్భంగా హుజూర్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ టీకాపై అవగాహన కల్పించేందుకు మంజుల హరిబాబు చేసిన కృషిని అభినందించారు. మండల వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ 1174 జనాభా గానూ 763 మంది టీకా అర్హులు ఉండగా 763 మంది మొదటి మోతాదు వ్యాక్సిన్ పొందినట్లుగా తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, ఆశా కార్యకర్తలు, వార్డు అధ్యక్షుడు చామకూరి అంజయ్య, కార్యదర్శి నాగుల్ మీరా,మహిళా అధ్యక్షురాలు శిరీష,నిర్మల,సుశీల,శ్రీను చీదెళ్ళ శిరీష,సీత,బాలమ్మ,పున్నయ్య,పుష్ప, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Satyam NEWS

మిస్ యూ ఫ్యాన్ :టీమ్ ఇండియా వీరాభిమాని మృతి

Satyam NEWS

ముంపు మండలాల ప్రజల వినూత్న నిరసన

Satyam NEWS

Leave a Comment