పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తూ ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న వెంకటాపూర్ కాంప్లెక్స్ సీఆర్పీ కుమార్ పాడ్య కు నేడు ప్రశంసా పత్రం అందచేశారు.
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఉత్తమ ఉపాధ్యాయులతో పాటుగా ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న కుమార్ పాడ్య కు కూడా ములుగు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి ప్రశంస పత్రం అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ బద్ధం సుదర్శన్ రెడ్డి, ACG రమేష్, వెంకటాపూర్ మండల విద్యాశాఖాధికారి అనంతుల సురేందర్ పాల్గొన్నారు.