జాతీయ మరియు రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు చుక్కల పార్ధసారథి (కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ), పెళ్లకూరు సాత్విక (జగన్స్ డిగ్రీ కాలేజీ), పి.వెంకట చైతన్య(కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజీ)లను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ శాసనసభ్యుడు పి అనిల్ కుమార్ యాదవ్ అభినందించారు.
నెల్లూరు విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించటం గర్వంగా ఉందన్నారు. అనిల్ కుమార్ యాదవ్ NSS వాలంటీర్లను అభినందిస్తూ విశ్వవిద్యాలయం దినదినాభివృద్ధి చెందుతుందని అన్నారు. వెంకటగిరి శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ భవిష్యత్తులో తన వంతు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. యువనేత ఆనం రంగమయూ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపారు. ఉపకులపతి, ఆచార్య జి యం సుందరవల్లికి, రిజిస్ట్రార్ డా. పి రామచంద్ర రెడ్డికి , ఎన్ ఎస్ ఎస్ సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ను, కృష్ణ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం కృష్ణా రెడ్డి ని అలాగే పి చంద్ర శేఖర్ రెడ్డి ని అభినందించారు.