రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ ,విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి కి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన నివాస గృహంలో పండుగ వాతావరణం నెలకొంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, అభిమానుల అభివందనలతో ఆయన నివాసంలో సందడి నెలకొంది.
జిల్లా ఏఎస్పీ సత్యనారాయణ , ట్రాఫిక్ డి.ఎస్.పి, మోహన్ రావు.. విజయనగరం రెవెన్యూ డివిజన్ అధికారి,నగరపాలక కమిషనర్ మరియు సిబ్బంది, మండల రెవెన్యూ అధికారి సిబ్బంది, మండల ప్రజా పరిషత్ అధికారి మరియు సిబ్బంది, మాజీ ఎంపీ డి.వి.జి. శంకర్రావు, విజయనగరం రెవిన్యూ డివిజనల్ అధికారి , ఆర్ అండ్ బి అధికారులు, నీటిపారుదలశాఖ, హౌసింగ్ అధికారులు ,పంచముఖ ఆంజనేయస్వామి ఆలయ పాలకమండలి సభ్యులు, ఫాస్టర్ అసోసియేషన్ ప్రతినిధులు, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, మెప్మా పిడి, మెడికోవర్ తిరుమల ఆసుపత్రి ప్రతినిధులు డాక్టర్ తిరుమల ప్రసాద్, డాక్టర్ విఎన్ పద్మ కుమార్ ,డాక్టర్ రామారావు, డాక్టర్ శివరాం, డాక్టర్ రామారావులతోపాటు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఆయా ప్రజా ప్రతినిధులు, అధికారులు,నాయకులు పెక్కు సంఖ్యలో తరలివచ్చి ఉప సభాపతి కోలగట్లకు తమ అభినందనలు తెలియజేశారు..