పశ్చిమగోదావరిజిల్లా ద్వారకా తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించారు.
మొత్తం నగదు రూపంలో 1 కోటి 53 లక్షల 32 వేల 944 రూపాయలు వచ్చాయని ఈ ఓ సుబ్బారెడ్డి వెల్లడించారు.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం 56 రోజుల హుండీ లెక్కింపులో వీటితో బాటు పలు దేశాల కరెన్సీ వచ్చినట్టు ఆయన తెలిపారు.
పాత వెయ్యి రూపాయల నోట్లు 3 పాత 500 నోట్లు 11 కూడా వచ్చాయి.
ఈ నగదుతో బాటు భక్తుల నుండి కానుకల రూపం లో 210 గ్రాముల బంగారం, 5 కేజీల 350 గ్రాముల వెండి వచ్చాయని ఆయన తెలిపారు.