విజయనగరం జిల్లా పోలీసు శాఖ లో కలకలం రేగింది. విజయనగరం హోమ్ గార్డ్స్ వింగ్ చూసే ఆర్. ఐ. ఈశ్వరరావు తన రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్నారు. భార్య…నిండు గర్భిణీ.. మూడేళ్ల పాప ఉండి కూడా ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీస్ క్వాటర్స్ తన నివాసంలో ఈ ఘోరానికి పాల్పడ్డారు. అయితే అధికారులు వేధింపులా లేక ఇంటిలో సమస్యలు అనే వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో మృతదేహం పోస్ట్ మార్టం కై ఉంది. కాగా విషయం తెలియగానే ఎస్పీ దీపికా..స్పెషల్ బ్రాంచ్ సీఐలు…శ్రీనివాసరావు, రాంబాబు లు హాస్పిటల్ కు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
previous post