ఒక దిక్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైనికుల భూములు ముట్టుకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెబుతుంటే లోకల్ నాయకులు మాత్రం సైనిక భూములను, పేదల భూములను ఆక్రమించుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్ లోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఈ సంఘటన జరిగింది.
ఇచ్చోడ లోని ఇస్లామ్ పుర కాలని లో 92 సర్వే నంబర్ లోని ప్లేట్ నంబర్ 7 ప్లాట్ ను 1998 లో అష్రాఫ్ అలీ వద్ద ఆర్మీ జవాన్ అక్రమ్ తండ్రి మొహ్మద్ మౌలానా కొనుగోలు చేశారు. అప్పటి నుండి ఇచ్చోడ గ్రామ పంచాయతిలో మౌలానా పేరు పై ఇల్లు టాక్స్ కడుతూ వస్తున్నాడు. రెండు సంవత్సరాల క్రితం ఇచ్చోడ కు చెందిన షేక్ యాకూబ్ తండ్రి షేఫోద్దీన్(మియా) అనే వ్యక్తి ఆ ప్లాటు ను కబ్జా చేశారు.
మొహ్మద్ మౌలానా కొడుకు అక్రమ్ ఇండియాన్ ఆర్మీ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఒక ఆర్మీ వ్యక్తికి చెందిన ప్లాటు ను కబ్జా చేయడంతో అధికారులకు చెప్పి కబ్జా చేసిన యకూబ్ కు నోటీస్ పంపించారు. కానీ యకూబ్ మాత్రం ఎటువంటి భయం లేకుండా ఉండడం వెనక ఒక పెద్ద అధికార పార్టీ నాయకుడు ఉన్నాడని తెలుస్తుంది.
రెవిన్యూ అధికారులకు, ఆదిలాబాద్ RDO కు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని ఆర్మీ కుటుంబ సభ్యులు వాపోయారు. ఆర్మీ జవాన్ అర్మీ అధికారుల దృష్టికి ఈ సమస్య ను తీసుకెళ్లి అక్కడి నుండి కలెక్టర్ కు చెప్పించారు. కలెక్టర్ వెంటనే ఇచ్చోడ MRO కు లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇచ్చారు.
కానీ అక్కడ ఎటువంటి స్పందన లేదని అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ్ ఉద్యోగ నిమిత్తం వెళ్ళినప్పుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో యకూబ్ బోథ్ వెళ్లి మరీ తల్లి ని, చెల్లి ని భయబ్రాంతులకు గురి చెస్తున్నారని అక్రమ్ తెలిపారు.
అధికార పార్టీ కి చెందిన ఒక నాయకుడు ఇలా ఒక భారతీయ సైనికుడి ప్లాటు కబ్జా చేసి ఇలాంటి భయ బ్రాంతులకు గురి చేస్తున్నా పోలీస్ శాఖ కానీ రెవిన్యూ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెతినట్టు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా పై అధికారులు వెంటనే ఒక ఆర్మీ సైనికుడి కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.