రిపబ్లిక్ టివి ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. 53 సంవత్సరాల ఒక ఇంటీరియర్ డిజైనర్ ను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించాడనే నేరంపై అర్నబ్ గోస్వామి పై మహారాష్ట్ర పోలీసులు కేసు పెట్టారు.
అయితే ఈ కేసు ఇంతకు ముందే ముగిసిందని అయితే పోలీసులు కక్ష సాధించేందుకు కేసును మళ్లీ ఓపెన్ చేశారని రిపబ్లిక్ టివి రిపోర్టు చేసింది.
మహారాష్ట్ర పోలీసులు బలవంతంగా అర్నబ్ గోస్వామి ఇంటిలోకి ప్రవేశించి అతడిని అరెస్టు చేశారు. తనపై పోలీసులు దాడి చేశారని, తనను గాయపరిచారని అర్నబ్ గోస్వామి ఆరోపించారు.
తాజా సమాచారం మేరకు ఆతనిని రాయగడ్ పోలీసు స్టేషన్ కు తీసుకువెళ్లారు. అక్కడే అతనిపై కేసు నమోదు అయింది.