రాత్రికి ఊరేగింపుగా హుకుంపేటకు
ఉత్తరాంధ్ర ఆరాధ్య దేవత విజయనగరం కల్పవల్లి శ్రీశ్రీశ్రీ పైడితల్లి జాతర సందర్భంగా నిర్వహించబోయే సిరిమాను చెట్టు….జిల్లాలోని గంట్యాడ మండలం సిరిపురం లో లభ్యమైందని ఆలయ అనువంశిక పూజారి బంటుపల్లి బైరాగి నాయుడు తెలిపారు. నిర్ణయించిన ముహూర్తానికి సిరిపురంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, కలెక్టర్ సూర్య కుమారి ,ప్రజాప్రతినిధులు సమక్షంలో చింత చెట్లను గుర్తించి పూజలు చేసామన్నారు.
సరిగ్గా ఉదయం 08 15 నిమిషాలకు చెట్టును సిరిమానుగా చెక్కే కార్యక్రమం మొదలు పెట్టామన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండీ…సిరిపురం నుంచీ హుకుంపేటకు చెట్టు ను ఊరేగింపుగా తరలించనున్నామన్నారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చేరుతుందని..అక్కడే నిష్ఠగా సిరిమాను చెక్కే ప్రకృయ మొదలవుతుందని పూజారి తెలిపారు.