శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవ ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని ఎంపీ ఆదాల కితాబును ఇచ్చారు. నరసింహకొండలో శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన ఇక్కడికి వచ్చి స్వామి వారికి పూజలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తుల కోసం దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసిందని ప్రశంసించారు. రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని ఆ దేవుని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చైర్మన్ సురేందర్ రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డిసిసిబి మాజీ చైర్మన్ విజయకుమార్ రెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, వైసీపీ నేతలు వైవిరామిరెడ్డి, పెంచల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
previous post
next post