భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతుంది. చర్ల మండలం యర్రంపాడు అటవీ ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ) వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ గ్రామాల్లో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే చర్ల మండలం యర్రంపాడు అటవీ ప్రాంతంలో జరిగిన కూంబింగ్లో ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులను భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు ఎస్పి వినీత్ తెలిపారు. చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా ఈ కూంబింగ్లో పాల్గొన్నాయి. పీఎల్జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, చత్తీస్గఢ్తో సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచాయి.
previous post