అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ ప్రభుత్వం అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 3వ తేదీన ఇరాన్ అత్యున్నత జనరల్, రివల్యూషనరీ గార్డ్స్ లీడర్ ఖాసీమ్ సోలిమని ని అమెరికా డ్రోన్ లను ప్రయోగించి హత్య చేసింది. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై హత్య కేసు నమోదు చేసినట్లు టెహరాన్ ప్రాసిక్యూటర్ అలి అల్ ఖ్వాసీమెహర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సహకరించాల్సిందిగా ఇంటర్ పోల్ ను ఆయన కోరారు. ట్రంప్ తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారని, హత్య చేశారని ప్రాసిక్యూటర్ తెలిపారు. ట్రంప్ పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఆయన ఇంటర్ పోల్ ను కోరారు.