తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ముత్తా నగర్ మున్సిపల్ హైస్కూల్ ఆర్ట్ టీచర్ మంగళవారం ఆత్మహత్య యత్నం చేసింది. ప్రదానోపాధ్యా యురాలు హాలిమ్ పార్ట్ టైమ్ డ్రాయింగ్ టీచర్ నాగదేవి ని ఫుల్ డే పని చేస్తేనే శాలరీ బిల్లుపై సంతకం చేస్తానని బెదిరించారు.
నీకు దిక్కున్న చోట చెప్పుకో ఈనెల నీకు జీతం రాదు అని అనడంతో భయబ్రాంతు లకు గురి అయిన పార్ట్ టైమ్ ఆర్ట్ టీచర్ నాగదేవి ఈరోజు ఉదయం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య యత్నం చేసుకుంది.
హుటాహుటిన ఆమెని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
హెచ్.ఎం ను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలి
కాకినాడ ముత్తానగర్ మునిసిపల్ హై స్కూల్ లో సమగ్ర శిక్షా పార్ట్ టైం ఇంస్ట్రక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాగదేవిని ఆత్మహత్యా యత్నం చేసుకునే విధంగా వేధింపులకు గురిచేసిన హెచ్.ఎం. హలీమ్ ను వెంటనే సస్పెండ్ చేసి అరెస్టు చేయాలని ఏపీ పార్ట్ టైం ఇంస్ట్రక్టర్స్ ఫెడరేషన్ 588/2013 రాష్ట్ర కార్యదర్శి ఎం.చంద్ర శేఖర్ డిమాండ్ చేశారు.
కడప లో ఆయన మీడియా తో మాట్లాడుతూ కాకినాడ ముత్తానగర్ మునిసిపల్ హై స్కూల్ లో సమగ్రశిక్ష పార్ట్ టైం ఇంస్ట్రక్టర్ డ్రాయింగ్ టీచర్ గా విధులు నిర్వహిస్తున్న నాగదేవిని పార్ట్ టైం ఇంస్ట్రక్టర్స్ విధులు మధ్యాహ్న పని వేళలు మాత్రమే అనే ఆదేశాలు ఉన్నాయని ఆయన అన్నారు.
అయితే, ఆ పాఠశాల హెచ్.ఎం హలీమ్ పూర్తి రోజు (ఫుల్ డే) పనిచేస్తేనే శాలరీ బిల్లుపై సంతకం చేస్తానని, నీకు దిక్కున్న చోట చెప్పుకో ఈ నెల జీతం నీకు రాదని భయబ్రాంతులకు గురి చేయడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందిందని అన్నారు.
మంగళవారం సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య యత్నం చేసుకుందని, ప్రస్థుతం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో అత్యవసర చికిత్స విభాగంలో చికిత్స పొందుతోందని అన్నారు . నాగదేవి ఆత్మహత్యా యత్నానికి కారణమైన హెచ్.ఎం హలీమ్ ను వెంటనే సస్పెండ్ చేసి, అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా రాష్ట్ర అధికారులు స్పందించి ఎం.ఇ.ఓ లకు, హెచ్.ఎం లకు నిఖచ్చిగా పార్ట్ టైం ఇంస్ట్రక్టర్స్ పని విధానాన్ని (జాబ్ చార్ట్ )ఇచ్చి వారి సేవలను వినియోగించు కోవాలని ఉన్నతాధికారులను ఆయన కోరారు.