పేద కళాకారులకి సహాయం అందించాలనే దృక్పధంతో ఒక యూనియన్ గా ఏర్పడి కళాకారులలో నూతనోత్సాహం పుట్టించారు శ్రీకాకుళం జిల్లావాసులు. కళాకారులకు గుర్తింపు రావాలి, వారిని ఆదుకోవాలని కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు చిక్కొలు కళాకారులు. ఈమేరకు శనివారం శ్రీకాకుళం జిల్లా కళాకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు.
సంఘం అధ్యక్షులుగా ఈటీవీ ఫేమ్ మిమిక్రీ శివ, ఉపాదక్షులుగా మ్యాజిక్ ఉత్తమ్,రాంజీ ,అరవింద్ కార్యదర్శిగా మ్యాజిక్ బాలు, సహాయకార్యదర్శిగా కిల్లమ్ శెట్టి భవాని,కోశాధికారిగా సింగర్ దాము. సభ్యులుగా స్వప్న, శ్రీను, వెంకీ ,ఉమామహేశ్వరరావు, కుసుమ,నీలిమా,తారక్,అను, రాజు,సంపత్, వరం తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.