37.2 C
Hyderabad
April 19, 2024 13: 28 PM
Slider జాతీయం

అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి

813813-arun-jaitley-3

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో పూర్తి అయ్యాయి. ఢిల్లీలోని నిగమ్‌  బోధ్‌ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించారు. అంతకుముందు అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని  స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.   మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడ్డారు.

Related posts

ఇంటెలిజెన్స్ చీఫ్ గా పి వి సునీల్ కుమార్?

Satyam NEWS

మై గాడ్:కుమారున్ని కాపాడాలని తండ్రి కూడా చెరువు లో

Satyam NEWS

సెప్టెంబర్ నాటికి సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తి

Satyam NEWS

Leave a Comment